Today Kcr Meeting Karimnagar: ఇవాళ కరీంనగర్ లో బీఆర్ఎస్ సభ… కేసీఆర్ స్పీచ్‌పై ఉత్కంఠ

0
12

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ శంఖారావం పూరించనుంది. సెంటిమెంట్‌గా భావించే కరీంనగర్ వేదికగా నేడు కదన‌భేరి సభను నిర్వహించనుంది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తోంది. లక్ష మంది సభకు వచ్చేలా ఏర్పాట్లు చేశామని గులాబీ శ్రేణులు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల ప్రచార సభ కావడంతో కేసీఆర్ స్పీచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ ను, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. తమకు అచ్చొచ్చిన కరీంనగర్ గడ్డ నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. కరీంనగర్ ను ఉద్యమ కాలం నుంచి సెంటిమెంట్ గా భావిస్తారు. అక్కడ అడుగుపెట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుందని ఆయన నమ్ముతారు.

పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గుంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ తదితరులు నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాగా, లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బీజేపీ నుంచే పోటీ ఎదురవుతుందని అన్నారు. ఎన్నికల కోసం నిర్వహించే రోడ్ షోలలో తాను కూడా పాల్గొంటానని కేసీఆర్ ప్రకటించారు