ఈ నెల17న టీడీపీ- -జనసేన భారీ బహిరంగ సభ

0
15

టీడీపీ– జనసేన ఆధ్వర్యంలో మార్చి 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దాదాపు 10 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన PAC ఛైర్మన్ మనోహర్ వెల్లడించారు. ఈ సభలో ఉమ్మడి మేనిఫెస్టో. భవిష్యత్ కార్యాచరణను చంద్రబాబు. పవన్ ప్రకటిస్తారని వెల్లడించారు. బీజేపీతో పొత్తుపై స్పష్టత వచ్చాక రెండో జాబితాను వెల్లడిస్తామని తెలిపారు.

టీడీపీని BJP అడుగుతున్న ఎంపీ సీట్లివే..?

మరో వైపు ఎన్నికల్లో TDP, జనసేన, BJP పొత్తు కొలిక్కి వస్తున్నట్లు తెలుస్తోంది.చంద్రబాబు, పవన్ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. రాజమండ్రి. నరసాపురం, వైజాగ్, విజయవాడ. హిందూపూర్, అరకు ఎంపీ సీట్లను BJP అడుగుతోందని సమాచారం. కానీ టీడీపీ రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, అరకు సీట్లు ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే కైకలూరు. ధర్మవరం, విశాఖ (నార్త్). జమ్మలమడుగు, తిరుపతి అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు TDP ఓకే చెప్పిందట.