Shock To BRS: బీఆర్ఎస్ కు మరో షాక్… కాంగ్రెస్‌లో గుత్తా అమిత్ రెడ్డి !

0
21

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలేలా ఉంది. పార్టీ సీనియర్ నేత, మండలి సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి…. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నుంచి నల్గొండ లేదా భువనగిరి టికెట్ కోసం యత్నించారు అమిత్ రెడ్డి.

ఇదే టైంలో ఆయన కాంగ్రెస్ నేత, సీఎం సన్నిహితుడు వేంనరేందర్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న నల్గొండ ఎంపీ సెగ్మెంట్ పై రివ్యూ చేశారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. ఈ మీటింగ్ కు గుత్తా అమిత్ రెడ్డి డుమ్మా కొట్టారు. కొద్ది రోజులుగా ఆయన పార్టీ మారతారనే ప్రచారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో జోరుగా సాగుతోంది.

బీఆర్​ఎస్​ నుంచి నల్గొండ లేదా భువనగరి ఎంపీ టికెట్​ ఆశించిన అమిత్ ​రెడ్డి భంగపడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్​ పార్టీలో చేరేందుకు ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్​లో చేరితే భువనగిరి నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుందని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. టికెట్ గురించే చర్చించేందుకే అమిత్ రెడ్డి ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సైతం భేటీ అయినట్లు వార్తలు వినిపించాయి. కాంగ్రెస్‌లో టికెట్ కన్ఫమ్ అయితే.. గుత్తా అమిత్ రెడ్డి పార్టీ మారడం ఖాయమని సమాచారం.