Thousands Of Modis: వెయ్యిమంది మోదీలు, లక్షమంది బాబులొచ్చినా జగన్ ను ఓడించలేరు

0
16

టీడీపీ,బీజేపీ కూటమిపై ఏపీ మాజీ మంత్రి కోడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి కోడాలి నాని. వెయ్యిమంది మోదీలు, లక్షమంది బాబులు, కోటి మంది పవన్‌కళ్యాణ్‌లు కలిసి వచ్చినా జగన్ ను ఓడించలేరన్నారు. దేవుడి ఆశీస్సులు, ప్రజాబలంతో సీఎం జగన్‌ రానున్న ఎన్నికల్లో సింగిల్ గానే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

చంద్రబాబు జైలుకు వెళ్లకుండా ఉండేందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తనపై ఉన్న 57 అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లకుండా ఉండేందుకే బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రానని ముందే తెలుసుకున్న బాబు తనపై ఉన్న కేసుల్లో అరెస్టు కాకుండా తప్పించుకునేందుకే జతకట్టారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని బాబు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని ధ్వజమెత్తారు కోడాలి నాని.

బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు మూడు రోజులు ఢిల్లీలో పడిగాపులు గాయడం సిగ్గుచేటన్నారు కోడాలి నాని. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అందుబాటులో లేకపోయినా వారి పీఏలతో పొత్తు కుదుర్చుకున్నారని ఆరోపించారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని మండిపడ్డారు. ఎవరి బూట్లు అయినా నాకేందుకు వెనుకాడబోరు..
అధికారంలో ఉన్నప్పుడు నల్లచొక్కా వేసుకుని రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని పోరాటాలు చేసిన చంద్రబాబు కాదా? . భార్యా, పిల్లలు లేని మోదీ దేశాన్ని ఏం ఉద్దరిస్తారని, బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్‌తో కలసి పోటీ చేస్తున్నానని 2019 ఎన్నికల్లో చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు.