కేసీఆర్ కు దిక్కులేక ఆర్ఎస్ ప్రవీణ్ తో పొత్తు పెట్టుకుండు : మంత్రి కోమటిరెడ్డి

0
15

రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ప్రధాని మోడీ కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండలో మార్చి 06 బుధవారం రోజున మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి బీఆర్ఎస్, కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ కు దిక్కు లేక అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలుస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ సర్కార్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. గడిచిన పదేళ్లలో కేసీఆర్ తెలంగాణను సర్వనాశనం చేశాడన్నారు. కోట్లాది రూపాయల అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని వందేళ్లు వెనక్కి తీసుకువెళ్లాడన్నారు. కేసీఆర్.. సీఎం రేవంత్ ను ఎదురుకునే శక్తి లేక అసెంబ్లీ రావడం లేదని విమర్శించారు.

బీఆర్ఎస్ లాగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే పోతే ఆ పార్టీలో మిగిలేది నలుగురే మాత్రమేనన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత హరీష్ రావు బీఆర్ఎస్ లో ఉండడం డౌటేనని బీజేపీలోకి పోతాడని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. హరీష్ బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నట్లుగా తెలుస్తోందన్నారు. LRS పై గైడ్ లైన్స్ ఇంకా పూర్తి కాలేదని చెప్పిన మంత్రి.. దీనిపై బీఆర్ఎస్ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందన్నారు.