Chevella MP Aspirant Kausani Gyaneshwar : చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్.!

0
13

లోక్ సభ ఎన్నికల దగ్గర పడుతుండటంతో అభ్యర్థల ఎంపికపై బీఆర్ఎస్ స్పీ్డ్ పెంచింది. ఇప్పటికే ఐదుగురు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్..మరో స్థానం చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ రావు పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

చేవెళ్ల బరిలో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఉంటారని అందరి కంటే ముందే బీఆర్ఎస్ ప్రకటించింది. అయితే పోటీ చేయడానికి రంజిత్ రెడ్డి విముఖత చూపిస్తున్నారు. నిన్న రంగారెడ్డి జిల్లా అభ్యర్థులతో నిర్వహించిన భేటీకి రంజిత్ రెడ్డి హాజరు కాలేదు. దీంతో చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ను బరిలోకి దించేందుకు కేసిఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ కు బరిలోకి దించితే… మంచి ఫలితం వస్తుందని ఆయన భావిస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

ఐదు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులు

మహబూబ్ నగర్ – మన్నె శ్రీనివాస్
కరీంనగర్ – బి వినోద్ కుమార్
పెద్దపల్లి – కొప్పుల ఈశ్వర్
ఖమ్మం – నామ నాగేశ్వర్ రావు
మహబూబాబాద్ – మాలోత్ కవిత