నిన్ను చంపేస్తాం…ఎంపీ నవనీత్ రాణాకా బెదిరింపులు

0
12

తెలుగు వాళ్లకు సుపరిచతమైన నటి, ఎంపీ నవనీత్ రాణాకు బెదిరింపులు వచ్చాయి. మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గ ఎంపీ అయిన నవనీత్​ రాణాను చంపేస్తామంటూ ఆమె మొబైల్​​కు ఆడియో క్లిప్‌‌‌‌ పంపారు. ఎంపీతో పాటు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్‌‌ఎస్‌‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌‌పై అభ్యంతరకర పదజాలం వాడారు.

ఈ నెల 3న ఆమె ఫోన్​కు బెదిరింపులు రాగా.. ఆమె పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ జరుగుతోందని చెప్పారు.లోక్ సభ ఎన్నికల వేళ నవనీత్ కౌర్ మరోసారి అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది.ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం నవనీత్ కౌర్ ది.

ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ హీరోగా నటించిన శీను వాసంతి లక్ష్మీ అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు నవనీత్ కౌర్. ఆ తర్వాత ఈమె పలు చిత్రాల్లో నటించారు. అయినా సరైన గుర్తింపు అయితే రాలేదు. రాజకీయ నాయకుడైన రవి రాణాను 2011లో బాబా రాందేవ్ సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అలా ఆమెకు రాజకీయాలతో అనుబంధం ఏర్పడింది. ఆమె భర్త రవి రాణా బద్నేరా నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు.