Delhi Tour: నేడు ఢిల్లీకి చంద్రబాబు, పవన్.. బీజేపీతో పొత్తుపై సస్పెన్స్‌!

0
14

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ తో వీరు భేటీ కానుండగా.. రాష్ట్రంలో బీజేపీతో పొత్తుపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితం కూడా అమిత్ షాతో బాబు భేటీ కాగా.. పొత్తులపై స్పష్టత రాలేదు. నేటి సమావేశంలో కొలిక్కి వచ్చే అవకాశం ఉందని టీడీపీ-జనసేన శ్రేణులు భావిస్తున్నాయి.

అటు నిన్న బాబు-పవన్ ఉండవల్లిలో సమావేశమయ్యారు. ఢిల్లీ పరిణామాలతో పాటు.. అభ్యర్థుల జాబితాలు, బీజేపీతో పొత్తుపై చర్చించారు. రెండు గంటలకు పైగా సాగిన చర్చల్లో బీజేపీతో పొత్తు ఖరారు అయిన తర్వాతే పెండింగ్‌లో ఉన్న సీట్ల జాబితాను విడుదల చేయాలని నిర్ణయించినట్లు నేతలు తెలిపారు.

మరోవైపు బీజేపీ హైకమాండ్‌ మాత్రం పొత్తుపై ఎటు తేల్చకుండా గందరగోళంలో పడేసింది. ఏపీ బీజేపీ నేతలు కూడా హైకమాండ్‌దే తుది నిర్ణయం అని ప్రకటించేసింది. నిన్న బీజేపీ కోర్‌ కమిటీ మీటింగ్‌లో పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని చెబుతున్నారు నేతలు. ఇవాళ జరిగే సమావేశంలోనైనా క్లారిటీ వస్తుందేమోనని చూస్తున్నారు.