Mrri Rajashekar Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు

0
11

మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిపై అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఈరోజు కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ విషయమై ఈరోజు బీఆర్ఎస్ నేతలు నిరసన నిర్వహిస్తున్న సమయంలో కార్యాలయానికి వచ్చిన అల్వాల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి బెదిరించారు.

ఈ మేరకు ఎమ్మెల్యే తన విధులకు ఆటంకం కలిగించారని ఉప కమిషనర్ అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. కాగా ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. అల్వాల్‌ పురపాలక కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారాస శ్రేణులు బుధవారం ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పలువురు మహిళలు కింద పడి గాయాలపాలయ్యారు.