PM Modi Road Show in Hyderabad Tomorrow: రేపు హైదరాబాద్ లో మోదీ రోడ్ షో

0
10

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే రాష్ట్రంలోని 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు.

ఈ నెల 15న సాయంత్రం హైదరాబాద్ రానున్న మోదీ మీర్జాలగూడ నుంచి మల్కాజ్ గిరి వరక 1.3 కి.మీ రోడ్ షోలో పాల్గొననున్నారు. మల్కాజ్ గిరి నుంచి బీజేపీ తరపున ఈటెల రాజేందర్ పోటీ చేస్తుండగా.. ఆయనకు మద్దతుగా మోదీ ప్రచారం చేయనున్నారు.

ఈ నెల 16న నాగర్ కర్నూల్ లో మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించ నున్నారు. ఈ సభకు చుట్టుపక్కల ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ప్రజలను తరలించాలని నిర్ణయించారు. ఇటీవలే ఫిబ్రవరి 25న ప్రధాని రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే..