AP Politics: ఇవాళ వైసీపీ ఫైనల్ లిస్ట్..ఎల్లుండి నుంచే ప్రచారం

0
14

ఇవాళ ఏపీ సీఎం జగన్ వైసీపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. 175 అసెంబ్లీ. 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వెల్లడించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ రానుండడంతో ఎల్లుండి నుంచి ప్రచార ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. రోజుకు కనీసం రెండు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించేలా పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు

ఇప్పటికే విడతలుగా ఇన్ ఛార్జ్ లను మార్చిన వైసీపీ 70కి పైగా స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. ఇప్పటి వరకూ 76 స్థానాల్లో అసెంబ్లీ ఇన్ ఛార్జులు,24 ఎంపీ స్థానాల్లో ఇన్ ఛార్జుల పేర్లు ఖరారు చేసింది. సిట్టింగ్ లను కాదని, ఇతర నియోజకవర్గ నేతలను ఇన్ ఛార్జ్ లుగా నియమించారు.

ఇవాళ ఎన్నికల్ షెడ్యూల్ వస్తుండటంతో పార్టీలు స్పీడ్ పెంచాయి. అటు టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి కూడా రేపు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.