PM Modi Addresses A Public Meeting In Nagarkurnool: ఇవాళ నాగర్ కర్నూల్.. ఎల్లుండి జగిత్యాలలో మోదీ బహిరంగ సభలు

0
13

లోక్ సభ ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్ రానుండడంతో ఎన్నికల ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచింది. ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నిన్న మల్కాజ్ గిరిలో రోడ్ షో నిర్వహించిన మోదీ.. ఇవాళ నాగర్ కర్నూల్​లో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నాగర్ కర్నూల్​లో బహిరంగ సభాస్థలి వద్దకు వస్తారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు గుల్బర్గా బయల్దేరతారు.

ఎల్లుండి జగిత్యాలలో..

ప్రధాని మోదీ ఆదివారం రాత్రి 7.45కు బేగంపేట ఎయిర్‌‌‌‌పోర్టు కు విరానున్నారు. రాత్రి 8 గంటలకు రాజ్ భవన్ చేరుకొని, అక్కడే బస చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ నుంచి మొదలై..10.15 గంటలకు బేగంపేట నుంచి జగిత్యాలకు వెళ్తారు. 11.15 గంటలకు జగిత్యాలకు చేరుకోనున్నారు. ఉదయం 11.30 నుంచి 12.20 వరకు జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. 12.30 గంటలకు ఆయన అక్కడి నుంచి హైదరాబాద్​ కు తిరుగుపయనమవుతారు.