Chandrababu letter : ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ

0
14

ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి టీడీపీ చంద్రబాబు లేఖ రాశారు. 2019 తర్వాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ‘ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి తమపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్ లో తెలియజేయాల్సి ఉంది. గత ఐదేళ్లలో నాపై పలు అక్రమ కేసులు బనాయించారు. వ్యక్తిగతంగా ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి నేను ఆ సమాచారం పొందడం ఆచరణ సాధ్యం కాదు’ అని డీజీపీ, అన్ని జిల్లాల ఎస్పీలు, ఏసీబీ, సీఐడీలకు లేఖలు పంపారు.

ఏ క్షణంలో అయినా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున ముందుగా ఈ వివరాలు తెలియజేయాలని కోరుతున్నట్లు చెప్పారు. రహస్యంగా ఉంచిన అక్రమ కేసులతో ప్రభుత్వం కుట్రలు చేసే అవకాశం ఉందనే అనుమానంతో ముందుగానే లేఖ రాసి వివరాలు కోరినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. నామినేషన్ ప్రక్రియలో వైఎస్సార్‌సీపీ చేసే అక్రమాలకు చెక్ పెట్టేలా లేఖ ద్వారా సమాచారం కోరారంటున్నారు. సమాచారం లేని కేసుల విషయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా లేఖ రాసినట్లు చెప్పుకొచ్చారు. మరి చంద్రబాబు రాసిన లేఖకు డీజీపీ కార్యాలయం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.