Indian Cricket: ఇండియా టీ20వరల్డ్కప్ గెలవాలంటే కోహ్లీ ఉండాల్సిందే : కృష్ణమాచారి శ్రీకాంత్

0
15

టీ20వరల్డ్ కప్ లో భారత్ గెలవాలంటే స్టార్ బ్యాటర్ కోహ్లీ కచ్చితంగా జట్టులో ఉండాలని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ‘గత టీ20వరల్డ్ కప్ లో టీమ్‌ను సెమీస్‌కు చేర్చింది కోహ్లీనే. అతడు జట్టులో ఉండడని చెప్పిందెవరు? ఈ రూమర్స్ క్రియేట్ చేసే వారికి వేరే పనేం లేదా? దేన్ని ఆధారంగా చేసుకుని వారు ఇది చెబుతున్నారు?’ అని ఓ ఇంటర్వ్యూలో ఫైర్ అయ్యారు.

2011 వరల్డ్​కప్​లో సచిన్ తెందూల్కర్​కు దక్కిన గౌరవం ఇప్పుడు విరాట్​కు కూడా దక్కాల్సిందేనని నమ్ముతున్నానని చెప్పారు. విరాట్ కోసం టీమ్ఇండియా ప్రపంచకప్​ నెగ్గాలని… తన కెరీర్​లో అది అతి పెద్ద విషయమని తెలిపారు. కాగా టీ20 జట్టులో కోహ్లీ ఉండడని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్​కప్​ వెస్టిండీస్, యూఎస్ఏ సంయుక్త వేదికలుగా జరగనున్న నేపథ్యంలో అక్కడి స్లో పిచ్​లపై విరాట్ బ్యాటింగ్ సరిపోదని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.

ఇక 2022 టీ20 ప్రపంచకప్​లో విరాట్ అదరగొట్టాడు. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్​గా నిలిచాడు. కానీ, ఆ తర్వాత టీమ్ఇండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి మేనేజ్​మెంట్ టీ20 ఫార్మాట్​కు విశ్రాంతినిచ్చింది. దాదాపు 14 నెలల తర్వాత ఈ ఇద్దరూ 2024 జనవరిలో అఫ్గానిస్థాన్​తో జరిగిన టీ20 సిరీస్​తో పొట్టి ఫార్మాట్​లో రీఎంట్రీ ఇచ్చారు