TG Politics: ఇవాళ తెలంగాణలో మోదీ టూర్… జగిత్యాలలో సభ

0
12

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. జగిత్యాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఉదయం 11.30 గంటలకు సభలో మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని సభకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 1,600 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించనుండగా.. సభ ఏర్పాట్లను ఎంపీ అర్వింద్ పర్యవేక్షిస్తున్నారు.

గత రాత్రి ఏపీ పర్యటన ముగించుకొని ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్​ఎయిర్​పోర్ట్ కు చేరుకున్నారు మోదీ. 8.10 గంటలకు రాజ్ భవన్​చేరుకొని, అక్కడే బస చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు రాజ్​భవన్ నుంచి బయలుదేరి 10.10 గంటలకు బేగంపేట్​ఎయిర్​పోర్ట్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్​లో బయలుదేరి 11.20 గంటలకు జగిత్యాల చేరుకొని, బహిరంగ సభలో పాల్గొంటారు. సభ తర్వాత 12.35 గంటలకు జగిత్యాలలో బయలుదేరి.. 1.35 గంటలకు తిరిగి బేగంపేట్​ ఎయిర్​పోర్ట్​కు చేరుకుంటారు.

కాగా, నిజామాబాద్​ ఎంపీ అర్వింద్, నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్ పీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి తదితరులు సభ ఏర్పాట్లను పరిశీలించారు.