TG Politics: తెలంగాణకు ఇన్ చార్జ్ గవర్నర్ ఈయనే..

0
26

తెలంగాణ ఇంచార్జి గవర్నర్ గా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అదనపు బాధ్యతలను అప్పగించింది కేంద్రం . సౌందర్ రాజన్ తెలంగాణ గవర్నర్‌గా 2019 సెప్టెంబర్ 8న గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. దాదాపుగా నాలుగున్నరేళ్లు ఆమె గవర్నర్ పదవిలో కొనసాగారు.

తెలంగాణ గవర్నర్ కు , పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు తమిళి సై ఇవాళ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. రిజైన్ అనంతరం తమిళి సై హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి చెన్నై వెళ్లారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర మీడియాతో మాట్లాడిన ఆమె తెలంగాణ ప్రజలకు తమిళి సై కృతజ్ఞతలు తెలియజేశారు.

తెలంగాణ ప్రజలను వదిలేసి వెళ్తున్నందుకు బాధగా ఉందని ఎమోషనల్ అయ్యారు తమిళి సై. తెలంగాణ ప్రజలందరు తన అన్నాదమ్ములు..అక్కాచెల్లెళ్ళని.. ఎప్పుడు తెలంగాణ ప్రజలను మరువబోనన్నారు.