AP POlitics: పోస్టులు కాదు టీడీపీనే డిలీట్ చేయాల్సి వస్తుంది.. ట్విట్టర్లో వైసీపీ వార్నింగ్

0
13

టీడీపీకి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నోటీసులు ఇవ్వడంపై వైసీపీ Xలో స్పందించింది. టీడీపీకి ఎన్నికల కమిషన్ మొట్టికాయలు వేసింది. సీఎం జగన్‌ను అవమానించేలా టీడీపీ Xలో పోస్టు వేసింది. ఈసీ నోటీసులు ఇవ్వడంతో లెంపలేసుకుని నిమిషాల్లో పోస్టును డిలీట్ చేసింది. ఇకపై ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే.. పోస్టులు కాదు టీడీపీనే డిలీట్ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది.

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సోషల్ మీడియా విభాగం అసభ్యకర పోస్టులు పెట్టిందని..చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నిన్న ఈసీకీ ఫిర్యాదు చేశారు. ఎక్స్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ప్లాట్‌ఫామ్స్‌పై సీఎం జగన్ వ్యక్తిత్వంపై దాడి చేసేలా ప్రచారం చేస్తున్నారని, అసభ్యకర ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై సీఈవో ముకేశ్ కుమార్ మీనా స్పందిస్తూ చంద్రబాబుకు నోటీసులు పంపారు. టీడీపీ సోషల్‌మీడియా విభాగం పోస్టులు ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని.. 24 గంటల్లోగా సీఎం జగన్‌పై పెట్టిన అభ్యంతరకర పోస్టులు తొలగించాలని ఆదేశించారు. దీంతో టీడీపీ సోషల్ మీడియా ఆ పోస్టులు డిలీట్ చేసింది.