kollywood: చావుబతుకుల్లో హీరోయిన్.. సాయం కోసం ఎదురుచూపు

0
32

ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మలయాళ హీరోయిన్ అరుంధతి నాయర్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఆమె చికిత్స కోసం డబ్బు సహాయం అడిగినా తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఎవరూ ముందుకు రావడం లేదని అరుంధతి ఫ్రెండ్, నటి రమ్య వాపోయారు. ‘అరుంధతికి బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. సాయం కావాలని అడుగుతున్నా నడిగర్ సంఘం నుంచి స్పందన లేదు’ అని తెలిపారు.

రోడ్డు ప్రమాదానికి గురైన అరుంధతి నాయర్ పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు ఐసీయూలో చికిత్స జరుగుతుంది. వైద్యానికి భారీగా ఖర్చు అవుతుంది. మేము చేయగలిగిన సహాయం చేస్తున్నాము. అయినప్పటికీ వైద్యానికి డబ్బులు సరిపోవడం లేదు. మీ వంతు ఆర్థిక సహాయం చేయండి. మీ సహాయం అరుంధతికి మెరుగైన వైద్యం అందించేందుకు తోడ్పడుతుంది… అని ఆమె రాసుకొచ్చారు.

కాగా ‘పొంగి ఎలు మనోహర(2014)’ సినిమాతో నటిగా వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టిందీ అరుంధతి. విరుమాండికుమ్‌ శివానందికమ్‌, సైతాన్‌, పిస్తా, ఆయిరం పోర్కాసుకల్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఒట్టకోరు కాముకన్‌ చిత్రంతో మలయాళ చిత్రసీమకు పరిచయమైంది. పద్మిని, డోంట్‌ థింక్‌ అనే వెబ్‌ సిరీస్‌ల్లోనూ యాక్ట్‌ చేసింది.