IPL 2024: రేపటి నుంచే ఐపీఎల్… ఓపెనింగ్ సెలబ్రేషన్స్‌ కు రెడీ

0
25

రేపటి నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. రెండున్నర నెలలపాటు క్రికెట్ ప్రేమికులను అలరించనుంది. 10 జట్లు టైటిల్ కోసం బరిలోకి దిగనున్నాయి. తొలి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సీఎస్కే-ఆర్సీబీ మధ్య జరగనుంది. అలాగే ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీ వేడుకలు అదిరిపోనున్నాయి. ఏఆర్ రెహమాన్, అక్షయ్ కుమార్, సోనూ నిగమ్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్లు తమ ప్రదర్శనలతో అలరించనున్నారు.

ఐపీఎల్ సీజన్-17 ఆరంభానికి సిద్ధమైంది. రెండున్నర నెలల పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించబోతోంది. ఈ నెల 22న ఆర్సీబీ, సీఎస్‌కే జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా ఐపీఎల్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఏఆర్ రెహమాన్, అక్షయ్ కుమార్, సోను నిగమ్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్లు తమ ప్రదర్శనలతో అలరించనున్నారు. సా.6.30 నుంచి లైవ్ ప్రారంభంకానుంది.

ఐపీఎల్‌17వ సీజన్‌‌లో మూడు టీమ్స్‌‌ తమ కెప్టెన్లను మార్చుకున్నాయి. ముంబై ఇండియన్స్‌‌ తమ సక్సెస్‌‌ఫుల్ లీడర్‌‌‌‌ రోహిత్ శర్మ ప్లేస్‌‌లో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చి విమర్శలకు గురైంది. వరుసగా మూడో ఏడాది సన్ రైజర్స్‌‌ తమ కెప్టెన్‌‌ను మారుస్తూ మార్‌‌‌‌క్రమ్ స్థానంలో ఆస్ట్రేలియన్ కమిన్స్‌‌కు పగ్గాలు అప్పగించింది. పాండ్యాను వదులుకున్న గుజరాత్‌‌ యంగ్‌‌స్టర్ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌కు కెప్టెన్సీ ఇచ్చింది. విమర్శల మధ్య ముంబై కెప్టెన్సీ పాండ్యాకు సవాల్ విసురుతుండగా, కొత్తగా కెప్టెన్సీ బాధ్యత కమిన్స్‌‌, గిల్‌‌కు చాలెంజ్ కానుంది.