Tollywood: రామ్ చరణ్ సినిమాలో విలన్లే లేరట.. లేటెస్ట్ అప్ డేట్

0
19

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు సెట్ అయినప్పుడే బజ్ ఏర్పడుతుంది. అలాంటిదే.. రామ్ చరణ్‌, బుచ్చిబాబు కాంబో. వీరిద్దరి కలయికలో ఓ సినిమా బుధవారం పట్టాలెక్కింది. మైత్రీ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్‌.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. సినిమా కోసం ‘పెద్ది’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

ప్యాన్ ఇండియా స్థాయికి వెళ్లిన రామ్ చరణ్ సినిమాలో విలన్ అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరని సమాచారం. ఈ కథలోని పరిస్థితులు, హీరోకి ఎదురయ్యే సవాళ్లు మాత్రమే… ప్రతినాయక పాత్రని పోషించబోతున్నాయని తెలుస్తోంది. చరణ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న ఓ హీరో కోసం ఈ తరహా కథని ఎంచుకోవడం ఓరకంగా సాహసమే! అంటున్నారు విశ్లేషకులు.

పూర్తిగా పాజిటీవ్ కోణంలో సాగే పాత్రకు శివరాజ్ కుమార్ ను తీసుకున్నారట. పాత్రపై శివరాజ్ కుమార్ కూడా చాలా నమ్మకాన్ని, ఇష్టాన్నీ చూపిస్తున్నారట. ఆయన తెలుగులో నటించడం ఇదే తొలిసారి. బుచ్చిబాబు చెప్పిన కథను.. అరగంటలోనే శివరాజ్ కుమార్ ఓకే చేశారట. జాన్వీ కపూర్ ఈ మూవీలో హీరోయిన్. ఒకప్పుడు చిరంజీవి, శ్రీదేవి జంట మరోసారి కళ్లముందు కనిపిస్తుందనడంలో సందేహం లేదు. ఈ మూవీలో అబ్బనీ తియ్యనీ దెబ్బ సాంగ్ రీమిక్స్ ఉంటుందని సమాచారం.