RS Praveen Kumar : కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ

0
15

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో బీఎస్పీ రాష్ట్రాధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. హైదరాబాద్ నందినగర్లోని నివాసంలో ఆయన కేసీఆర్ ను కలిశారు. ఈ స‌మావేశంలో బీఎప్పీ పార్టీ ప్రతినిధుల బృందంతో పాటు హ‌రీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్క సుమాన్‌తో పాటు ప‌లువురు ప్రతినిధులు పాల్గొన్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ -ప్రవీణ్ కుమార్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న ప్రచారంపై ప్రవీణ్ కుమార్ ఇవాళ ఉదయమే స్పందించారు. ఎలాంటి వదంతులు నమ్మొద్దన్నారు.

కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ , బీఎస్పీ పొత్తు పెట్టుకుంటాయని తెలుస్తోంది. ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేయనుండగా బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని సమాచారం. ఇవాళ మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానాల అభ్యర్థులపై కేసీఆర్ నేతలతో చర్చించారు. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ కుమార్ కు మద్దతు ఇచ్చేందుకు ఆయన అంగీకరించినట్లు వార్తలొస్తున్నాయి.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీలోకి దిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓటమి చెందారు. ఏకంగా మూడో స్థానానికి పరిమితం అయ్యారు.