TG Politics: పార్టీ మారినోళ్లను వదిలిపెట్టం.. పల్లా సీరియస్ వార్ని్ంగ్

0
22

బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇతర పార్టీలలోకి వెళ్లే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని ఆ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సీరియస్ వార్ని్ంగ్ ఇచ్చారు. పార్టీ మారాలనుకునే వారు తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే కరవయ్యారని ఎద్దేవా చేశారు. అందుకే తమ పార్టీ నుంచి నేతలను చేర్చుకొని టిక్కెట్లు ఇస్తున్నారని విమర్శించారు. పిరికి పందలు మాత్రమే పార్టీ మారుతున్నారని ఘాటువ్యాఖ్యలు చేశారు.

సొంత లాభం కోసం ఓ పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం దారుణమన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. అక్రమాలు చేసిన వారు భయంతో పార్టీ మారుతున్నారని… అలాంటి వారి అవినీతి బాగోతాన్ని బీఆర్ఎస్సే బయటపెడుతుందని హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏడు విడతలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు నగదును విడుదల చేసిందని తెలిపారు. తాము రెండోసారి అధికారంలోకి వచ్చాక రూ. 75 వేల కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. .

ఎనిమిదో విడత రైతుబంధుకు సంబంధించి రూ. 7 వేల 500 కోట్లు కూడా తాము అసెంబ్లీ ఎన్ని కలకు ముందు వేస్తామంటే కాంగ్రెస్ అడ్డుపడిందన్నారు. మరి ఆ డబ్బులు ఎక్కడకు వెళ్లాయి? ఆ డబ్బులు ఎవరి తీసుకున్నారు? ఏ కాంట్రాక్టర్ కుఇచ్చారు? అనే వివరాలు అందరికీ తెలుసునన్నారు. తాము ఖాళీ ఖజానా ఇచ్చామని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుబంధును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.