Kale Yadaiah : సీఎం రేవంత్ రెడ్డితో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ

0
14

సీఎం రేవంత్ రెడ్డితో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ అయ్యారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సీఎంను కలిశారు. సచివాలయంలో సీఎంతో ఆయన భేటీ అయ్యారు. . ఆయన వెంట మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర నేతలు ఉన్నారు. దాదాపు అరంగట పాటు ఈ సమావేశం కొనసాగింది.అయితే ఆయనను ఎందుకు కలిశారనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది..ఇటీవల చాలా మంది బీఆర్ఎస్ నాయకులు పార్టీని వీడుతున్న క్రమంలో కాలె యాదయ్య కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.

ఇటీవల భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కుటుంబ సభ్యులతో కలిసి కూడా సీఎంను కలవగా.. ఆయన కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. కానీ ఈ వార్తలను ఆయన ఖండించలేదు. కాగా, కాలె యాదయ్య చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. 2018, 2023లలో బీఆర్ఎస్ నుంచి గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 268 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు.