Delhi Liquor Scam: లిక్కర్ కేసులో కవిత కస్టడీ పొడిగింపు

0
25

లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీని పొడిగించి కోర్టు. మార్చి 26 వరకు ఈడీ కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. మరో మూడు రోజులు కస్టడీ పొడిగించడంతో కవిత,కేజ్రీవాల్ ను కలిపి ఈడీ విచారించనున్నట్లు తెలుస్తోంది.

కవిత కస్టడీ ముగుస్తుండటంతో ఇవాళ కోర్టులో హాజరుపర్చింది ఈడీ. మరో ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ స్పెషల్ కోర్టును కోరారు ఈడీ అధికారులు. కేసు విచారణకు కవిత సహకరించడం లేదని ఈడీ ఆఫీసర్లు కోర్టుకు వివరించారు. లిక్కర్ స్కాంలో మరికొన్ని చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కవిత ఫోన్ డేటాను పూర్తిగా డిలీట్ చేశారని కోర్టుకు చెప్పారు ఈడీ అధికారులు. మరికొందరితో కలిపి కవితను విచారించాల్సి ఉందన్నారు ఈడీ అధికారులు. కస్టడీలో ఎప్పటికప్పుడు ఆమెకు మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నామని…. డాక్టర్లు సూచించిన ఆహారాన్నే ఇస్తున్నామని కోర్టుకు వివరించారు ఈడీ అధికారాలు.

నలుగురి స్టేట్ మెంట్లు, ముడుపుల గురించి కవితను ప్రశ్నించినట్లు తెలిపారు. కుటుంబం వ్యాపారం, ఆదాయపు పన్ను గురించి వివరాలు అడిగితే ఇవ్వలేదంది ఈడీ. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.