AP Politics: ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాసులురెడ్డి?

0
13

ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డినే బరిలోకి దింపాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన లాంఛనమే అని తెలుస్తోంది. వివిధ కారణాలతో ఆయన వైసీపీకి రాజీనామా చేసిన మాగుంట .. టీడీపీలో చేరిన రోజు కూడా తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. టీడీపీ నాయకత్వానికి ఆ మేరకు సమాచారం ఇచ్చిన తర్వాతే ఆయన రాఘవరెడ్డి పేరును ప్రకటించారు.

తొలుత ఈ స్థానానికి శ్రీనివాసులు రెడ్డితో పాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి అభ్యర్థిత్వాన్ని కూడా టీడీపీ పరిశీలించింది. భవిష్యత్తులో కేంద్రంతో వివిధ అంశాలపై రాయబారాలు జరిపేందుకు లోక్‌సభ సభ్యులుగా పార్టీలో కొందరు సీనియర్లు, ఢిల్లీ రాజకీయాల్లో పట్టు ఉన్న వారు ఉంటే మంచిదని టీడీపీ భావించింది. ఇప్పటికే ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల్లో యువకులు, అందునా కొత్తవారు ఎక్కువగా ఉన్నారు.

దీంతో చంద్రబాబు శ్రీనివాసుల రెడ్డిని రంగంలోకి దించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాఘవరెడ్డి కూడా తన తండ్రే పోటీ చేస్తారని రాఘవరెడ్డి ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు తీవ్రత పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రాఘవ ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. దీనితో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేయడం ఖాయమైంది.