IPL 2024: చెలరేగిన కోహ్లీ, దినేశ్ కార్తీక్..బెంగళూరు విక్టరీ

0
14

ఐపీఎల్ సీజన్ 17లో బెంగళూరు బోణీ కొట్టింది. మొదటి మ్యాచ్ చెన్నైతో ఓటమి పాలైన బెంగళూరు నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించింది. బెంగళూరు బ్యాట్స్ మెన్ కోహ్లీ, దినేశ్ కార్తీక్ చెలరేగడంతో గెలిచింది. ఛేజింగ్‌‌‌‌లో డుప్లెసిస్‌‌‌‌ (3) ఫెయిలైనా కోహ్లీ దుమ్మురేపాడు. తొలి ఓవర్‌‌‌‌లోనే 4 ఫోర్లు కొట్టిన అతను తర్వాతి రెండు ఓవర్లలో మరో 4 ఫోర్లు బాదాడు. 5వ ఓవర్‌‌‌‌లో కామెరూన్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ (3) వికెట్‌‌‌‌ పడ్డా, రజత్‌‌‌‌ పటీదార్‌‌‌‌ (18) అండగా నిలిచాడు. దీంతో ఆర్‌‌‌‌సీబీ 50/2తో పవర్‌‌‌‌ప్లేను ముగించింది. ఫీల్డింగ్‌‌‌‌ పెరిగిన తర్వాత రెండు ఓవర్లలో 11 రన్స్‌‌‌‌ రాగా, 9వ ఓవర్‌‌‌‌లో కోహ్లీ, రజత్‌‌‌‌ చెరో సిక్స్‌‌‌‌ కొట్టారు. 10వ ఓవర్‌‌‌‌లో సింగిల్‌‌‌‌తో కోహ్లీ 31 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. కానీ 11, 13 ఓవర్లలో బ్రార్‌‌‌‌ (2/13) ఆర్‌‌‌‌సీబీకి ఝలక్‌‌‌‌ ఇచ్చాడు. వరుసగా పటీదార్‌‌‌‌, మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ (3)ను ఔట్‌‌‌‌ చేశాడు. చివరకు 22 బాల్స్‌‌‌‌లో 47 రన్స్‌‌‌‌ కావాల్సిన దశలో దినేశ్‌‌‌‌ కార్తీక్‌‌‌‌ సూపర్‌‌‌‌ ఫినిషింగ్‌‌‌‌ ఇచ్చాడు. మహిపాల్‌‌‌‌ 17 తో కలిసి 4, 4, 6, 4, 4, 6, 6, 4తో 48 రన్స్‌‌‌‌ చేసి ఆర్‌‌‌‌సీబీని గెలిపించాడు. దీంతో19.2 ఓవర్లలోనే బెంగళూరు 178 స్కోరు చేసింది. విరాట్‌‌‌‌కు ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌ అవార్డు లభించింది.

అంతకుముందు టాస్ ఓడిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. పంజాబ్ ఓపెనర్ శిఖర్ దావన్ 45 పరుగులతో చెలరేగాడు.ప్రభ్ శిమ్రన్ 25, లివింగ్ స్టోన్ 17, శామ్ కరన్ 23, జితేశ్ షర్మ 27 పరుగులు చేశారు. చివరి ఓవర్‌లో శశాంక్‌ సింగ్ 8 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 21 ధాటి చెలరేగాడు. దీంతో పంజాబ్ స్కోరు 176 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, మాక్స్ వెల్ తలో రెండు వికెట్లు తీయగా.. యశ్ దయాల్ , జోసెఫ్ లకు చెరో ఒక వికెట్ తీశారు.