AP Politics: మళ్లీ వైసీపీలోకి క్రికెటర్ అంబటి రాయుడు?

0
22

మళ్లీ వైసీపీలోకి క్రికెటర్ అంబటి రాయుడు రానున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. తాజాగా ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘సిద్ధం!!’ అని రాయుడు పోస్ట్ చేశారు. నేటి నుంచి వైసీపీ అధినేత, సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే రాయుడు ‘సిద్ధం’ అని పోస్ట్ చేయడంతో మళ్లీ వైసీపీలోకి వస్తారా? అనే చర్చ మొదలైంది.

కాగా, గతేడాది డిసెంబర్ లో వైసీపీలో చేరారు రాయుడు.. వైసీపీలో చేరిక సందర్భంగా రాయుడు మాట్లాడుతూ.. తాను మొదటి నుంచి వైఎస్ జగన్ అభిమానిని అన్నారు. సీఎం జగన్ అవకాశమిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని ప్రకటించారు. గుంటూరు ఎంపీ స్థానం నుంచి రాయుడు బరిలో దిగుతారని వార్తలు వినిపించాయి.

వైసీపీ కండువా కప్పుకున్న వారంలో రోజుల్లో అంబటి రాయుడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. జనవరి 7న రాజీనామా చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ క్రమంలో ఆయన జనసేనలో చేరుతారన్న ప్రచారం నడించింది. అయితే ఆ తర్వాత అంబటి రాయుడు రాజకీయాల్లో ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి మరోసారి అంబటి రాయుడు పేరు తెరపైకి వచ్చింది.