AP Politics: ఇవాళ్టి నుంచి చంద్రబాబు ‘ప్రజాగళం’ పర్యటన .. షెడ్యూల్ ఇదే

0
25

నేడు పలమనేరు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ‘ప్రజాగళం’ పర్యటన మొదలుపెట్టనున్నారు. ఇవాళ్టి నుంచి మార్చి 31 వరకు వరుసగా నాలుగు రోజులు పర్యటించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఇవాళ పలమనేరుతో పాటు పుత్తూరు, మదనపల్లెలో పర్యటిస్తారు. రేపు రాప్తాడు, శింగనమల, కదిరి, శుక్రవారం శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలులో ప్రచారం నిర్వహిస్తారు. ఈ నెల 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో, 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు పర్యటించనున్నారు. సోమ, మంగళవారాల్లో ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పం వెళ్లనున్నారు.

ప్రజాగళంలో భాగంగా చంద్రబాబు కుప్పం నుండి బయలుదేరి పలమనేరులో ఉదయం 11 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆపై మధ్యాహ్నం 2. 30 నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు నగరి నియోజకవర్గ పరిధిలోని పుత్తూరులో జరిగే ప్రజా గళం కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ఐదున్నర గంటల నుండి ఏడున్నర గంటల వరకు మదనపల్లిలో జరిగే ప్రజా గళంలో పాల్గొని, ఆపై రాత్రికి మదనపల్లిలోనే చంద్రబాబు బసచేస్తారు. మొత్తంగా రాయలసీమలో జగన్ వర్సెస్ చంద్రబాబు ప్రచార సభలు రాయలసీమలో పొలిటికల్ పొలిటికల్ హీట్ ను పెంచనున్నాయి