TG Politics: హైకోర్టులో ఎమ్మెల్యే దానం నాగేందర్ పై పిటిషన్

0
18

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని రాజు యాదవ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు . అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పై గెలిచిన దానం నాగేందర్ ..ఇటీవల కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న దానం సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీచేస్తున్నారు.

ఒక పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుండి ఎంపీగా పోటీ చేయడం చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని పిటిషన్ లో తెలిపారు. దానం నాగేందర్ పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలుచేశారు. దానంపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ పై మార్చి 28న హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ పోటీచేస్తుండగా.. బీఆర్ఎస్ నుంచి పద్మారావు, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి బరిలో దిగుతున్నారు.