TG Congress: వీహెచ్ కు రేవంత్ బుజ్జగింపులు

0
10

సీఎం రేవంత్ రెడ్డిని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో టికెట్ దక్కకపోవడంపై హనుమంతరావు అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల రేవంత్ పై బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.

దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ వీహెహెచ్ ను సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు సీనియర్ నాయకులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు.

లోక్ సభ ఎన్నికలకు తెలంగాణలోని 17 స్థానాలకు ఇప్పటికే 9 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 8 మందిని ఇవాళ ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ అవుతుంది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి కూడా పాల్గొననున్నారు.