IPL 2024: ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్ !

0
26

ఐపీఎల్ 17వ సీజన్ లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ కు మరో గట్టి షాక్ తగిలింది. గత కొంత కాలంగా గాయంతో ఆటకు దూరమైన టీ20 స్పెషలిస్ట్ ముంబై స్టార్ బ్యాటర్ సూర్యకు మార్ యాదవ్ ఇంకొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల శాస్త్రచికిత్స చేయించుకు న్న సూర్యకుమార్ ప్రస్తుతం ఎన్సీఏలో కోలుకుంటున్నాడు. అయితే పూర్తి ఫిట్నె స్ సాధించడానికి అతనికి మరికొన్ని రోజు ల సమయం పడతుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

దాంతో ఇప్పటికే టోర్నీలో వరుస గా రెండు మ్యాచ్ లు ఓడిన ముంబై ఇండియన్స్ కు ఇది చేదు వార్తే. అతను త్వరలో కోలుకొని జట్టులో చేరాలని ముంబై ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గతేడాది డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా సూర్యకుమార్ గాయపడ్డాడు. అనంతరం జర్మనీలో సర్జరీ చెయించుకున్న అతను ప్రస్తుతం బీసీసీఐ జాతీయ క్యాంప్ లో వైద్యుల పర్యవేక్షణ లో ఉన్నాడు.

కాగా, సూర్య త్వరలోనే కోలుకొని ముంబై జట్టులో చేరుతాడని ఓ బీసీ సీఐ అధికారి పేర్కొన్నారు. కాగా, ఐపీఎల్ 2024 ఎడిషన్లో చెత్త ప్రదర్శనలు చేసిన ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో రెండో మ్యాచ్లో స జరై హైదరాబాద్ చేతిలో ఓడింది. తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 1న రాజస్తాన్ రాయల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లోనైన బోణీ కొట్టుతుందేమో చూడాలి.