TG Politics: నాకు కేసీఆర్ ఫోన్ చేయలేదు: బాబు మోహన్

0
24

తాను బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని సినీనటుడు, ప్రజాశాంతి పార్టీ నేత బాబూమోహన్ స్పష్టం చేశారు. ప్రజాశాంతి పార్టీ తరఫునే వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నా. నాకు కేసీఆర్ ఫోన్ చేయలేదు. నేను కేసీఆర్‌తో మాట్లాడి దాదాపు ఆరేళ్లు అవుతోంది. ఇదంతా ఎవరు సృష్టించారో తెలియటం లేదు. నన్ను ఎవరూ కొనలేరు. నన్ను కొనేవారు ఈ భూమి మీద పుట్టలేదన్నారు.

వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బాబు మోహన్ ను బరిలోకి దింపాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు.. ఇందులో భాగంగానే కేసీఆర్ బాబుమోహన్ కు ఫోన్ చేశారని నిన్న ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ తరపున పార్లమెంట్ అభ్యర్ధిగా ప్రకటించిన కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో.. పార్టీ అధిష్టానం డైలమాలో పడింది. ఈ నేపథ్యంలో బాబుమోహన్ బీఆర్ఎస్ నుంచి వరంగల్ బరిలో ఉంటారని చర్చ జరిగింది.

ఎన్నికల షెడ్యూల్‌కు ముందు బీజేపీ నుంచి టికెట్ ఆశించిన బాబూ మోహన్.. టికెట్ రాదన్న విషయం తెలిసి ఆ పార్టీకి రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరారు. ప్రజాశాంతి పార్టీ నుంచి వరంగల్‌ లో పోటీచేసేందుకు సిద్దమయ్యారు బాబు మోహన్.