TG Politics: కాంగ్రెస్ లోకి జూ.ఎన్టీఆర్ సోదరి సుహాసిని.?

0
26

తెలంగాణ టీడీపీ నాయకురాలు, దివంగత నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుహాసినిని తెలంగాణ కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ,మంత్రి కొండా సురేఖ,పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఉన్నారు

సుహాసిని కళ్యాణ్ రామ్ సోదరి అని అందరికి తెలిసిందే… 2018 ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి సుహాసిని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు చేతిలో ఓడిపోయారు. గత కొన్ని రోజులుగా రాజకీయా కార్యక్రమాలకుదూరంగా ఉంటున్న సుహాసిని ఉన్నట్టుండి రేవంత్ రెడ్డిని కలవడంతో చర్చనీయాంశంగా మారింది. సుహాసిని కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జోరందుకుంది.