IPL 2024: ఇవాళ సొంతగడ్డపై ఆర్సీబీకి పరీక్ష

0
29

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇవాళ సొంతగడ్డపై మరో పరీక్ష ఎదుర్కోనుంది. ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు 14 మ్యాచు‌లు జరగ్గా.. 12 మ్యాచుల్లో హోం టీమ్స్ గెలిచాయి. కేకేఆర్ చేతిలో ఆర్సీబీ, నిన్న రాజస్థాన్ చేతిలో ముంబై మాత్రమే ఓడాయి. దీంతో ఆర్సీబీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. అయితే.. ఈరోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో లక్నోతో ఆర్సీబీ మ్యాచ్ ఆడనుంది. లక్నోపై గెలిచి ఆ ముద్ర చెరిపేసుకుంటుందేమో వేచిచూడాలి.

మరో వైపు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్ల ఫామ్‌పై ఆ జట్టు చీఫ్ కోచ్ ఆండీ ఫ్లవర్ స్పందించారు. ‘వీలైనంత త్వరగా బ్యాటర్లు ఫామ్‌లోకి వస్తారు. స్టార్ బ్యాటర్లు ఒక్కసారి పరుగులు రాబట్టడం మొదలుపెడితే భారీ స్కోర్లు చూడొచ్చు. అందులో నాకెలాంటి అనుమానం లేదు’ అని ఫ్లవర్ తెలిపారు. కాగా ఆర్సీబీలో ఇప్పటివరకు బ్యాటింగ్‌లో కోహ్లీ(181 రన్స్) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. మరోవైపు బౌలర్లూ తీవ్రంగా నిరాశపరుస్తున్నారు.