CM REVANTH: భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ ‎రెడ్డిని గెలిపించాలి- సీఎం రేవంత్

0
24

భువనగిరి : లోక్‎సభ ‎ఎన్నికలు దగ్గర పడుతుండడంతో తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పలు పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై చర్చిస్తున్నారు. తాజాగా ఈరోజు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించి చర్చించారు. ఈ క్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకొని.. భువనగిరి పార్లమెంట్ స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని.. నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ పరిధి నేతలు పాల్గొన్నారు.