JANASENA : పవన్ కళ్యాణ్‎కు ఈసీ నోటీసులు.. 48 గంటలు టైం

0
23

విజయవాడ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్‎కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల అనకాపల్లిలో నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ సీఎం జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఈ క్రమంలో పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్‎పై చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ పవన్ కళ్యాణ్‎కు నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా జగన్‌‌‌పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని పవన్‌ను ఈసీ ఆదేశించింది. అయితే పవన్ కళ్యాణ్‎కు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.