BREAKING : రచ్చరేగుతున్న ఉండి టీడీపీ టిక్కెట్

0
20

ఉండి : ఉండి టీడీపీ టిక్కెట్ అభ్యర్థి మార్పు వ్యవహారం తీవ్ర రచ్చరేగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును మార్చొద్దు అంటూ జిల్లా అధ్యక్షురాలు తోట సీతా రామలక్ష్మి ఇంటిని ముట్టడించారు టీడీపీ నాయకులు. ఆమె ఇంటి ముందు కూర్చుని ఉండి టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వన్ని మార్చితే సహించేది లేదంటూ నాయకులు అల్టిమేటం జారీ చేశారు. ఈ క్రమంలో.. ఇప్పటికే క్యాడర్ రాజీనామా పత్రాలను అధినేతకు అందించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును కొనసాగిస్తామంటూ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.