BREAKING : బీఫ్ జిందాబాద్ అంటూ రెచ్చగొడుతున్నారు- మాధవీ లత

0
17

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో లోక్‌సభ ప్రచారం పూర్తిగా మతం రంగు పులుముకుంది. ఇటీవలే ఓ ర్యాలీలో మసీదును లక్ష్యంగా చేసుకుని బీజేపీ అభ్యర్థి మాధవీలత రాముడు బాణాన్ని సంధిస్తున్నట్లుగా ఫోజులిచ్చారు. అయితే, ఆ విషయంపై ఎంఐఎం చీఫ్ అసద్దుద్దీన్ ఓవైసీ సీరియస్ అయ్యారు. ఇలాంటి చర్యల వల్ల తెలంగాణ శాంతికి భంగం వాటిల్లుతుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా, అసద్దుద్దీన్ మతపరమైన వ్యాఖ్యలు చేశాడంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆమె సీఈవో వికాస్ రాజ్‌ను కలిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అసదుద్దీన్ మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. బీఫ్ జిందాబాద్ అంటూ హిందువులను రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో పోలీసుల తీరుపై కూడా తమ అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు.