TS POLITICS: బీఆర్ఎస్ 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు- మంత్రి కోమటి‌రెడ్డి వెంకట్‌రెడ్డి

0
15

భువనగిరి : బీఆర్ఎస్ నాయకులు మోకాళ్ల యాత్ర చేసినా.. భువనగిరి, నల్లగొండలో డిపాజిట్లు కూడా రావని మంత్రి కోమటి‌రెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన భువనగిరిలో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో 13 నుంచి 14 ఎంపీ సీట్లను గెలవబోతున్నామని అన్నారు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నల్లగొండ జిల్లాను పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు. నీటీ వాటాల విషయంలో కేసీఆర్, జగన్‌తో లాలూచీ పడ్డారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు కేసీఆర్ వల్లే నల్లగొండ జిల్లాలో కరువు తాండవం చేస్తుందని అన్నారు. మళ్లీ మిర్యాలగూడకు కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. అసలు బస్సు యాత్ర చేయడానికి కేసీఆర్‌కు సిగ్గుండాలని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో బీఆర్ఎస్ శకం ముగిసిందని.. బీఆర్ఎస్ పార్టీని పట్టించుకునే నాథుడే లేడని అన్నారు. మరోవైపు బీజేపీ మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయాలు చేస్తుందని స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని ధీమా వ్యక్తం చేశారు. దమ్ముంటే బీఆర్ఎస్ మెదక్‌లో గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. మేము చిటికేస్తే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్‌కు కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.