Barrelakka : నాగర్ కర్నూల్ లోక్‎సభ నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

0
11

నాగర్ కర్నూల్ : శిరీష అలియాస్ బర్రెలక్క నాగర్ కర్నూల్ లోక్‎సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్‌కు ఆమె నామినేషన్ పత్రాలను అందించారు. శిరీష గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆమె పోటీ చేయడం అప్పుడు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఆమెకు అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే కేవలం 5 వేల పైచిలుకు ఓట్లు మాత్రమే సాధించారు. కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి, మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్ రావు నిలిచారు. కాగా, ఇప్పుడు మళ్లీ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్ వేశారు.