AP POLITICS : సీఎం జగన్‌కు వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ సంచలన లేఖ

0
11

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్ : ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల వేళ ఏపీ పాలిటిక్స్ వైఎస్ వివేకా మరణం చుట్టూ తిరుగుతున్నాయి. తాజాగా గురువారం సీఎం జగన్‌కు వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ సంచలన లేఖ రాశారు. “2009లో నువ్వు మీ తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించావో..2019లో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనుభవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు మమ్మల్ని ఎక్కువగా బాధపెట్టాయి. మన కుటుబంలోనీ వారే హత్యకు కారణం కావడం.. హత్యకు కారణం ఆయిన వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటం బాధేసింది. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్న ను ఈ విధంగా నీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాట్లాడటం దారుణం. చెప్పలేనంత విధంగా హననం చేయించడం ఇది నీకు తగునా? న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్ళను హేళన చేస్తూ.. నిందలు మోపుతూ, దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే.. నీకు మాత్రం పట్టడం లేదా? సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే నీవు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఎంటి? కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇదేనా నీ కర్తవ్యం? ఇంకా బాధించే అంశం.. హత్యకు కారకులైన ఆయిన వారికి మరలా ఎంపీగా అవకాశాన్ని నీవు కల్పించడం.. ఇది సమంజసమా? ఇటువంటి దుశ్చర్యలు నీకు ఏ మాత్రం మంచిది కాదు. ఇది నీకు తగినది కాదు అని విన్నవించుకుంటున్నా.. హత్యకు కారకుడు ఆయిన నిందితుడు నామినేషన్ దాఖలు చేసినందున.. చివరి ప్రయత్నంగా, న్యాయంగా, ధర్మంగా ఆలోచన చేయమని.. నిన్ను ప్రార్థిస్తున్నా. రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని.. ప్రమాణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. న్యాయం, ధర్మం, నిజం వైపు నిలబడమని నిన్ను వేడుకుంటున్నా” అని లేఖలో సౌభాగ్యమ్మ పేర్కొన్నారు