AP NOMINATIONS : ఏపీలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

0
17

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్ : ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా.. నేటితో నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది. గురువారం 3 గంటలకు నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.., 4,210 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలోని 25 లోక్‎సభ స్థానాలకు 731 మంది అభ్యర్థుల నుంచి నామినేషన్లు అందాయి. కాగా, రేపు (ఏప్రిల్ 26) నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు అవకాశం ఉంది. దేశంలో ఈసారి సార్వత్రిక ఎన్నికలను 7 దశల్లో నిర్వహిస్తుండడం తెలిసిందే. నాలుగో దశలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‎సభకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుండగా.., జూన్ 4న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరపనున్నారు.