AP POLITICS : వైఎస్ షర్మిల చీరపై సీఎం వైఎస్ జగన్‌ కామెంట్.. ఘాటుగా స్పందించిన షర్మిల

0
13

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న గుంటూరులో ఏపీసీసీ చీఫ్ భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలకు ఘాటుగా స్పందించారు. వేలమంది ఉన్న సభలో సొంత చెల్లెలు వేసుకున్న బట్టల మీద ప్రస్తావన చేస్తారా..? ఎవరైనా..? అని ప్రశ్నించారు. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, తాను వేసుకున్న బట్టలు మీద ప్రస్తావించారని మండిపడ్డారు. సొంత చెల్లెలు అని కూడా చూడకుండా, జగన్ ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దిగజారుడు రాజకీయాలు చెయ్యాల్సిన అవసరం ఏం ఉంది ? అని ప్రశ్నించారు. నేను బాబు దగ్గర మోకరిల్లానట, పసుపు చీర కట్టుకున్నానట, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ నేను చదువు తున్నానట, ఇవన్నీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడిన మాటలు అని దుయ్యబట్టారు. అవును నేను పసుపు చీర కట్టుకున్నా, అయితే ఏంటి..? పసుపు చీర కట్టుకోవడం తప్పా..? పసుపు కలర్‌పై చంద్రబాబుకి ఏమైనా పేటెంట్ రైటా ఉందా..? చంద్రబాబు పచ్చ కలర్‌ను కొన్నారా..? అని ఆమె ప్రశించారు. జగన్ రెడ్డి మరిచిపోయాడనుకుంటాను, గతంలో సాక్షి ఛానెల్‌కి పసుపు రంగు ఉండేది అని ఎద్దేవ చేశారు. పసుపు మంగళకరం అయిన రంగు అని నాడు స్వయంగా YSR చెప్పారని పేర్కొన్నారు.

అలానే పసుపు రంగు టీడీపీకి సొంతం కాదని.., వైఎస్ఆర్ అన్నాడని షర్మిల తెలిపారు. అందుకే వైఎస్ఆర్ స్వయంగా సాక్షికి పసుపు రంగు పెట్టించారని.., అంతెందుకు పసుపు మనం వంటల్లో కూడా వేస్తాం కదా అని ఆమె వెల్లడించారు. అసలు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు చీర గురించి మాట్లాడుతారా?.. నా ఒంటిమీద ఉన్న బట్టలు గురించి మాట్లాడుతుంటే సీఎంకి సభ్యత ఉందని అనుకోవాలా..? లేక లేదని అనుకోవాలా..? జగన్ రెడ్డికి అసలు సంస్కారం ఉందా..? అని ఘాటుగా దుయ్యబట్టారు. పైగా తాను చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను చందువుతన్నానని తెలిపిన సీఎం గురివింద వేషాలు వేస్తున్నారు అని దుయ్యబడ్డారు. రాసిచ్చిన స్క్రిప్ట్‌ని చూసుకుంటూ చదివేది జగన్ రెడ్డినే, మక్కీకి మక్కీ చదివేది జగన్ రెడ్డినే, కనీసం ఆ రాసించిన స్క్రిప్ట్ అయినా సరిగ్గా చదువుతారా అంటే, అదీ చేతకాదు అని ఎద్దేవ చేశారు. ఇక తాను వైఎస్ఆర్ బిడ్డనని, తనకు మోకరిల్లె అవసరం లేదని తెలిపారు. అలానే మీ కుక్క బిస్కెట్లు తిని ఎంతో మంది తనపై తప్పుడు ప్రచారం చేసినా పట్టించుకోలేదని తెలిపారు. ఇక బీజేపీ దగ్గర మోకరిల్లింది మీరని.. మోడీకి దత్తత పుత్రుడు జగన్ రెడ్డి అని పేర్కొన్నారు. సీఎంగా ఉండి రాష్ట్ర ప్రయోజనాలు మీద ఒక్కరోజు మాట్లాడలేదు.. జగన్ రెడ్డి వైఎస్ఆర్ వారసుడు కాదు.. మోడీ వారసుడు, క్రైస్తవులను చంపుతుంటే మోడికి మద్దతు పలికాడని షర్మిల మండిపడ్డారు.