TS POLITICS: కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీదరించుకుంటున్నారు- ధర్మపురి అరవింద్

0
12

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం దేశంలో దోచుకున్నంతగా ప్రజా ధనాన్ని.. బ్రిటిష్ వారు కూడా దోచుకోలేదని నిజామాబాద్ ఎంపీ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని 38వ డివిజన్ పరిధిలో 131, 132 బూత్‎లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో అరవింద్ పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాలకు పెట్టింది పేరని.. ఆ పార్టీ నాయకులు నింగి నేలను కూడా తమ అక్రమాలను అవినీతిని వదిలిపెట్టలేదని విమర్శించారు. అందుకే దేశవ్యాప్తంగా ప్రజలు ప్రధాని మోడీ నాయకత్వం కోరుకుంటున్నారని.. కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మభ్యపెడుతుందని మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ అందిస్తామని ఎన్నికల ముందు ప్రచారాలు చెప్పిన ముఖ్యమంత్రి.. ఆగస్టు 15 ప్రకటిస్తామని చెబుతూ మరోసారి రైతులను మోసం చేసే కుట్ర పన్నుతున్నారని అన్నారు. తాము ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా మోడీకి తమ ఓటు అని తాము అడగకముందే చెబుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి పటేల్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు పంచ రెడ్డి ప్రవళిక, బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ, ఇతర సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.