Ts Politics: 30 మంది కార్పొరేటర్లను నేనే కాంగ్రెస్‌లోకి పంపించా- మాజీ మంత్రి మల్లారెడ్డి

0
38

పాయింట్ బ్లాంక్, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్‌ అసెంబ్లీ పరిధిలోని దాదాపు 30 మంది మున్సిపల్‌ కార్పొరేటర్లను తానే కాంగ్రెస్‌లోకి వెళ్లమంటూ చెప్పానని అన్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకు హస్తం పార్టీలోనే ఉంటూ బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలని కార్పొరేటర్లకు తాను సూచించానని మల్లారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌‌లో ఉంటూ పార్టీలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని కార్పొరేటర్లతో చెప్పానని అన్నారు. అయితే తాము కాంగ్రెస్‌లో ఉండలేకపోతున్నామని కార్పొరేటర్లు చెబుతున్నారని మల్లారెడ్డి అన్నారు. హస్తం పార్టీలోని సీనియర్‌ నేతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వారు ప్రతి రోజూ తనకు ఫోన్లు చేస్తున్నారని మల్లారెడ్డి పేర్కొన్నారు.