TS Politics: సోనియా గాంధీపై అద్దంకి కీలక వ్యాఖ్యలు

0
12

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి వేడుకలను అంగరంగ వైభంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతోంది. జూన్ 2న హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌‌లో వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన వ్యక్తిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆమెతో పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను, రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు ఆర్పించిన అమరుల కుటుంబాలను సైతం ఈ వేడుకల్లో సన్మానించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా, జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‎తో సహా అన్ని రాజకీయా పార్టీలను ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. ఇక, సోనియా గాంధీ లేకుంటే అసలు తెలంగాణ వచ్చేది కాదని.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీ మిగిలిపోతారని అద్దంకి అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కొందరికే పరిమితం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసమే పార్టీ పెట్టారని.. అందుకోసమే తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి రాజకీయ వ్యాపారంగా మార్చారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్.