RAJA SINGH: నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు.. అందుకే సీఎం రేవంత్ రెడ్డి నంబర్ ఇచ్చాను- రాజాసింగ్

0
19

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయన్న విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తనకు ఫోన్ చేసి బెదిరించడానికి ట్రై చేసిన వారికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్ ఇచ్చానని తెలిపారు. ” నాకు ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయని బెదిరింపు కాల్స్ చేసిన వారు అడిగారు. ఇంకో నెంబర్ ఉందని చెప్పి సీఎం రేవంత్ నంబర్ ఇచ్చాను. ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదు. అందుకే ముఖ్యమంత్రి నంబర్ ఇచ్చాను. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా? లేదా?.. విచారణ ముందుకు సాగుతుందా? లేదా? ఇవాళ నాకు కంటిన్యూస్‌గా బెదిరింపు కాల్స్ వచ్చాయి.. ఫోన్ చేసిన వారు పాలస్తీనాకు చెందిన వారిలాగా ఉన్నారని.. ధర్మం కోసం నువ్వు పనిచేస్తే చంపేస్తామని తనను బెదిరిస్తున్నారు” అని ఆయన పేర్కొన్నారు. అలానే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో కాల్స్ వచ్చాయి. అప్పుడు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. ఇప్పుడు సీఎంగా రేవంత్ ఉన్నాడు.. ఇప్పుడైనా వీటిపై చర్యలు తీసుకుంటారో లేదో అని సీఎం నెంబర్ ఇచ్చానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.