Hyderabad : పాలు విరిగాయని భార్యపై దాడి

0
12

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: పాలువిరిగాయని భార్యపై భర్త, అత్త, ఆడపడుచులు దారుణంగా దాడికి పాల్పడిన ఘటన మధురానగర్ పీఎస్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్ నగర్ అల్లాఉద్దీన్ కోఠికి చెందిన హీనాబేగం(28)కి ఎల్లారెడ్డి గూడకు చెందిన హుస్సేన్ (42)కి ఇచ్చి పెళ్లి చేశారు. నాలుగేళ్ల క్రితం వీరి పెళ్లి కాగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్త హుస్సేన్, అత్త అఫ్రోజ్ బేగం, ఆడపడుచు సోని, మరిదిలు తబ్రేజ్, అయ్యూబ్‌లు ఆమెని శారీరరకంగా, మానసీకంగా వేధిస్తున్నారు.

కాగా, పెళ్లి సమయంలో రూ. 2లక్షలు కట్నం ఇచ్చినా.. మళ్లీ అదనపు కట్నం తేవాలని వేధించసాగారు. ఈ క్రమంలో అత్త వారింట్లో పాలు మరిగిస్తున్న సమయంలో పాలు విరిగాయి. దీంతో పాలు విరగొట్టావంటూ మళ్లీ వీరంతా కలిసి మెటల్ పైపుతో ఇష్టమొచ్చినట్లు కొట్టారు. మీ కూతురు చనిపోయిందని హీనా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన ఇంటికొచ్చి చూసేసరికి తీవ్ర గాయాలపాలైన హీనా అపస్మారక స్థితిలో ఉంది. బాధితురాలని చికిత్స కోసం అమీర్ పేట ఆసుపత్రికి తరలించా. పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.