Nalgonda: నల్లగొండ జిల్లాలో గూడ్స్ రైలు కిందపడి ఇద్దరు బలవన్మరణం

0
11

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లా పరిధిలో గురువారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి ఇద్దరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మిర్యాలగూడ మండల పరిధిలోని వెంకటాద్రిపాలెం గ్రామం దుర్గానగర్‌లో చోటుచేసుకుంది. అదే ప్రాంతానికి చెందిన లక్ష్మి (24), దుర్గా ప్రసాద్ ఇవాళ ఉదయం మండల పరిధిలోని ఐలాపురం సమీపంలో ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పట్టాల పైనుంచి తొలగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ల ఆత్మహత్యకు కారణం వివాహేతర సంబంధమే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.