KCR: కేసీఆర్‎పై తెలంగాణ కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్

0
11

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఈ పడిగాపుల పాపం నీది కాదా కేసీఆర్?.. ఇంకెంత కాలం ఈ దొంగ మాటలు అని కాంగ్రెస్ విమర్శలు చేసింది. విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. పత్తి విత్తనాల కోసం పడిగాపులు అని 11 నెలల క్రితం ఓ మీడియా సంస్థ ప్రచురించిన స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేస్తూ.. ఈ పడిగాపుల పాపం నీది కాదా కేసీఆర్?!.. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఇలా ఇంకెంత కాలం ఈ దొంగమాటలు! అని ట్వట్టర్ లో పోస్ట్ చేసింది. దీనిపై అధికారం చేతిలో ఉందని.. అన్ను మిన్ను కానకుండా ప్రవర్తించారని, అన్ని వ్యవస్థలని ముఖ్యంగా మీడియాని మేనేజ్ చేసి.. పదేండ్లు పబ్లిక్ పడే గోసని తొక్కి పెట్టారని ఫైర్ అయ్యింది. ఇప్పుడు ప్రజాపాలన రాగానే మీ పదేండ్ల పనితనం ఒక్కొక్కటిగా బట్టబయలు ఆవుతున్నాయని మండిపడింది. అలాగే కట్టిన కాళేశ్వరం నుండి మొదలు పెడితే ఎటు చూసినా బొక్కలేనని, మీ పదేండ్ల పాపాన్ని మా మీద రుద్దే దుర్మార్గం చేస్తున్నారని ఆరోపించింది. ఆ రోజులు మళ్ళీ రావడం కాదు. మీ రాక్షస పాలనకు రోజులు దగ్గర పడి, మీ కారు మూలకు పడిందన్న విషయం మళ్ళీ.. మళ్ళీ గుర్తు చేయాలా మీ గులాబీలకు?! అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.